News February 14, 2026
NZB: ‘ప్రజా పాలన’ ప్రభుత్వానికి బ్రహ్మరథం: TPCC చీఫ్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు ఘన విజయం అందజేసి ‘ప్రజా పాలన’ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. NZBలో ఆయన శుక్రవారం రాత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పురపాలక ఎన్నికల్లో 90కిపైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు, 1,300కుపైగా వార్డులు, 154కుపైగా డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు.
Similar News
News April 13, 2026
నిప్పుల కొలిమి నిజామాబాద్.. 40 దాటిన టెంపరేచర్

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత ‘అలర్ట్’ స్థాయికి చేరింది. ముఖ్యంగా మోస్రా, సాలూరలో అత్యధికంగా 41.6, నిజామాబాద్ సౌత్ 41.5°C, పెర్కిట్ (ఆర్మూర్):41.5°C, యెడపల్లి: 41.5°C మంచిప్ప, తుంపల్లిలోనూ 41.5 డిగ్రీల వేడి నమోదైంది. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News April 13, 2026
నిజామాబాద్: ఇంటర్ ఫలితాలపై అధికారుల ఆరా

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ఫలితాల గణాంకాలపై విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్లో జిల్లా వెనుకబడటం చర్చనీయాంశమైంది. ప్రథమ సంవత్సరంలో 56.64% ఉత్తీర్ణతతో 25వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో పరిస్థితి మరింత దిగజారి 66.19% ఉత్తీర్ణతతో 29వ ర్యాంకుకు పడిపోయింది. ఎక్కడ లోపం జరిగింది.. బోధనలో మార్పు రావాలా.. విద్యావ్యవస్థలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు చేస్తున్నారు.
News April 12, 2026
BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.


