News February 14, 2026
సత్తుపల్లిలో.. ఆ భార్యాభర్తలు ఓడిగెలిచారు..!

సత్తుపల్లి ఆ భార్యాభర్తలు ఓడి.. గెలిచినట్లయ్యింది. మాజీ ఛైర్మన్ కూసంపూడి మహేష్ 14వ వార్డులో గెలవగా ఆయన సతీమణి మాధురి ఓడారు. అదేవిధంగా తాజాగా ఛైర్మన్ రేసులో ఉన్న రెహనాబేగం 22లో గెలవగా ఆమె భర్త కమల్ పాషా అపజయం పాలయ్యారు. కాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన సత్తుపల్లి మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్యానల్ 17 అభ్యర్థులతో హస్తగతం చేసుకుంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్లో ఆరుగురు మాత్రమే గెలిచారు.
Similar News
News February 21, 2026
ఖమ్మం: రైతులకు ALERT.. 27 వరకు విక్రయాలు

ఖమ్మం జిల్లాలో 2025-26 సీజన్కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) పత్తి కొనుగోలు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఖమ్మం అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఈ గడువు వరకు కొనుగోళ్లు జరుగుతాయి. రైతులు తమ పత్తిని ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకుని విక్రయించుకోవాలని అధికారులు సూచించారు.
News February 21, 2026
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్టేట్/సెంట్రల్ బోర్డు గుర్తింపు, గత ఐదేళ్లలో 7వ, 10వ తరగతుల్లో 90% పైగా ఉత్తీర్ణత, మెరుగైన సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. దరఖాస్తులు డిప్యూటీ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
News February 21, 2026
ఖమ్మం: బాలకృష్ణ, లోకేశ్తో మంత్రి తుమ్మల భేటీ

హైదరాబాదులో జరిగిన ఒక వివాహ వేడుకలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాసేపు కుశలప్రశ్నలు వేసుకుని, వివిధ అంశాలపై ముచ్చటించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఒకే వేదికపై కలిసిన ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.


