News February 14, 2026

HYD విశాఖ వెళ్లేవారికి గమనిక.. టైమింగ్ ఛేంజ్

image

సిటీ నుంచి వైజాగ్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు రెగ్యులర్‌గా నడుస్తోంది. లింగంపల్లి- విశాఖ (12806) ఉ.6:55 గం.కు బయలుదేరి విశాఖకు రాత్రి 7:50కు చేరుకుంటుంది. విశాఖ- లింగంపల్లి (12805) రైలు విశాఖలో 6:20 గం.కు బయలుదేరి లింగంపల్లికి రాత్రి 7:15 గం.కు చేరుకుంటుంది. ఈ మార్పులు రేపటి నుంచి అమలవుతాయి.

Similar News

News February 19, 2026

HYD: SMలో పోస్టులు పెట్టకపోతే బతికేదేమో..?

image

వనస్థలిపురంలో గర్భిణిని మాజీ భర్త చంపడానికి ప్రధాన కారణం SMలో పెట్టిన ఫొటోలేనా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. మహారాష్ట్రకు చెందిన సునీత, పెద్దపల్లివాసి మహేశ్ 2022లో పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలతో 2024లో విడిపోయారు. ఆపై HYDలో పరిచయమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనాథ్‌ను సునీత రెండో వివాహం చేసుకుని తానిప్పుడు హ్యాపీగా ఉన్నట్లు SMలో పోస్ట్ చేసింది. ఇదిచూసి రగిలిపోయిన మహేశ్ <<19175503>>మాజీ భార్యను నరికి చంపాడు.<<>>

News February 19, 2026

HYD: TG FSLలో జాబ్స్.. పరీక్షల తేదీలివే..!

image

TG ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి రాత పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. మార్చి 5, 6, 7 తేదీలలో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.

News February 19, 2026

HYD: నెల రోజులు రెక్కీ చేసి.. దారుణ హత్య

image

వనస్థలిపురం PS పరిధిలో వివాహిత హత్య జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్ తెలిపారు. BNరెడ్డి కప్పలచెరువు వద్ద గ్రీన్ సిటీ కాలనీలో ఉండే సునీత(30)కు 2022లో నిందితుడు మహేశ్(30)తో వివాహమైంది. గొడవల వల్ల 2024లో విడాకులు తీసుకుని 2025 ఏప్రిల్‌లో శ్రీనాథ్‌ను రెండో వివాహం చేసుకుందన్న కోపంతో నెల నుంచి రెక్కి నిర్వహించి బుధవారం పథకం ప్రకారం చంపేశాడని సీఐ తెలిపారు.