News May 1, 2024

MBNR: టెన్త్ విద్యార్థులకు ALERT.!

image

టెన్త్ విద్యార్థులు ఇవాల్టి నుంచి మే 15 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు చెల్లించవచ్చు. రీకౌంటింగ్కు రూ.500, రీవెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలి. దరఖాస్తులో HMతో సంతకం చేయించి, హాల్‌టికెట్ జతపరిచి DEO ఆఫీసులో ఇవ్వాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు రీకౌంటింగ్ కోసం అప్లై చేయకూడదు. అటు జూన్ 3 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఫైన్ లేకుండా మే 16 వరకు ఫీజు కట్టొచ్చు.

Similar News

News January 12, 2026

కేటీఆర్ పాలమూరు పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. HYD నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి MBNRకు చేరుకుంటారు. 11 గంటలకు పట్టణంలోని పిస్తా హౌస్ నుంచి ఎంబీసీ గ్రౌండ్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు జిల్లాలో నూతనంగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లను కేటీఆర్ సన్మానించనున్నారు.

News January 12, 2026

మహబూబ్‌నగర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

image

కోయిల్‌కొండ మండలంలోని పారుపల్లిలో పొలంలో విద్యుత్ తీగలు సరి చేసేందుకు వెళ్లి ఓ రైతు మృతి చెందాడు. ఎస్ఐ తిరుపాజీ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్లపు తిరుపతయ్య (47) బోర్‌కు విద్యుత్ సరఫరా కావడం లేదని ట్రాన్స్‌ఫార్మ‌ర్ వద్దకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ తీగలను సరి చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News January 11, 2026

పాలమూరుకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17న పాలమూరుకు రానున్నారు. ఇటీవల MLA శ్రీనివాస్ రెడ్డి CMను కలిసి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు రావాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో సీఎం సానుకూలంగా స్పందించడంతో పర్యటన ఖరారైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. MBNR మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.12 వేల కోట్ల అంచనాలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే చెప్పారు.