News February 14, 2026
బడ్జెట్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్కు రూ. 638 కోట్లు

శాసనసభలో 2026-27 వార్షిక సంవత్సర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ మేరకు అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీకి రూ.638 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దీంతో పాటు రాష్ట్రంలోని పోలీసులకు 3,000 కొత్త పోలీసు వాహనాలు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం బడ్జెట్ కేటాయించారు.
Similar News
News February 15, 2026
పుతిన్ యుద్ధానికి బానిస: జెలెన్స్కీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి బానిస అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మండిపడ్డారు. తమ దేశంలో ప్రతి పవర్ ప్లాంటును రష్యా ధ్వంసం చేసిందని ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని చెప్పారు. హంగేరీ PM విక్టర్కు పొట్ట ఎలా పెంచుకోవాలో తెలుసని, రష్యా ట్యాంకులను ఆపడానికి సైన్యాన్ని ఎలా పెంచుకోవాలో తెలియదని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో ఎద్దేవా చేశారు.
News February 15, 2026
పాక్తో ఇవాళే మ్యాచ్.. చక్ దే ఇండియా!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరుకు వేళయింది. T20 WCలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఇవాళ సాయంత్రం 7 గంటలకు <<19134206>>మ్యాచ్ ప్రారంభం<<>> కానుంది. ఈ టోర్నీ చరిత్రలో పాక్తో ఆడిన 8 మ్యాచుల్లో 7 మన జట్టే గెలిచింది. ఆ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆ టీమ్ను మట్టికరిపించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్లో అభిషేక్, సూర్య, బౌలింగ్లో బుమ్రా, వరుణ్ చెలరేగితే గెలుపు మనదే. చక్ దే ఇండియా!
News February 15, 2026
ఈనెల 17న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 17న మంగళవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. టీఎస్ కేసీ, మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో బహుళజాతి కంపెనీల్లో నియామకాల కోసం ఈ మేళా చేపడుతున్నారు. డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, పీజీలో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


