News May 1, 2024

ద్వారకాతిరుమలలో రేపు పురంధీశ్వరి పర్యటన 

image

BJP రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థిని దగ్గుపాటి పురంధీశ్వరి గురువారం ద్వారకాతిరుమల మండలంలో పర్యటించనున్నారు.  ఉదయం 7 గంటలకు మారంపల్లిలో యాత్ర ప్రారంభమై గున్నంపల్లి మీదుగా కప్పలగుంట చేరుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్లజర్ల మండలంలోని గంటావారిగూడెం, దూబచెర్ల , నల్లజర్ల మీదుగా రాత్రి 9 గంటలకు పోతవరం చేరుకోనున్నారు.

Similar News

News March 16, 2026

ప.గో: మొదటి పరీక్షకు 371 గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని ప.గో డీఈఓ నారాయణ తెలిపారు. సోమవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు 23,415 మంది విద్యార్థులు గాను 23,044 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. 371 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని వెల్లడించారు.

News March 16, 2026

ఏపీ కేబినెట్ విస్తరణ.. పితానికి బెర్త్ ఖాయమేనా?

image

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తుండటంతో మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. ప్రస్తుతం జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్తగా ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఆచంట MLA పితాని సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీనియార్టీ, బీసీ సామాజికవర్గం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం పితానికి కలిసివచ్చే అంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

News March 16, 2026

ప.గో: మళ్లీ పాత చోటకే PGRS వేదిక

image

గొల్లల కోడేరు జిల్లా SP కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) యథావిధిగా నిర్వహించనున్నట్లు SP అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గతంలో రోడ్డు పనుల వల్ల భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగేదని, పనులు పూర్తి కావడంతో తిరిగి SP కార్యాలయానికి మార్చినట్లు వెల్లడించారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి తమ సమస్యల విన్నపానికి నేరుగా SP కార్యాలయానికి రావాలని కోరారు.