News February 15, 2026
కామారెడ్డి జిల్లాలో ప్రముఖ ప్రాచీన శైవ క్షేత్రాలు ఇవే!

కామారెడ్డి జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలు.
సిద్ధ రామేశ్వర స్వామి ఆలయం(భిక్కనూరు), త్రిలింగ రామేశ్వర స్వామి ఆలయం(తాండూర్), రాజరాజేశ్వర స్వామి ఆలయం(బండ రామేశ్వరపల్లి), మహదేవ్ ఆలయం(దోమకొండ), బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం(మద్దికుంట), సోమలింగేశ్వర స్వామి ఆలయం (దుర్కి). మీరు ఈ ఆలయాలు దర్శించారా! అయితే శివరాత్రికి వెళదాం పదండి.
Similar News
News March 11, 2026
VZM: సీఎం సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 6వ కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. తొలి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాంధ్ర, GSDP లక్ష్యాలు, జిల్లాల్లో అమలవుతున్న విజయవంతమైన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీఎస్, సుపరిపాలనలో సాంకేతికత వినియోగం, పెట్టుబడులపై చర్చించారు.
News March 11, 2026
వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి 24 రోజుల ముందే 78.464 మిలియన్ టన్నుల లోడింగ్ లక్ష్యాన్ని అధిగమించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 16.5 శాతం వృద్ధి. ఈ చారిత్రాత్మక విజయం అని.. టీమ్ వాల్తేరును డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అభినందించారు. కస్టమర్ కేంద్రీకృత విధానాలు, సమన్వయంతోనే ఈ అసాధారణ మైలురాయి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
News March 11, 2026
విశాఖ: మే నాటికి భోగాపురం రోడ్లు పూర్తి!

సీఎం ఆదేశాల మేరకు మే నెలాఖరుకల్లా భోగాపురం విమానాశ్రయ అనుసంధాన రహదారులను పూర్తి చేస్తామని VMRDA చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. ప్రస్తుతం 60% పనులు పూర్తయ్యాయని, నాణ్యతలో రాజీ లేకుండా నిర్ణీత గడువులోగా వంద శాతం పనులు ముగించాలని అధికారులను ఆదేశించారు


