News May 1, 2024

అఫ్ఘానీ వలసదారులను బహిష్కరించిన పాక్, ఇరాన్

image

సుమారు 2000 మందికిపైగా అఫ్ఘానిస్థాన్‌ వలసదారులను పాకిస్థాన్, ఇరాన్ బహిష్కరించాయి. దీంతో వారు తమ స్వదేశానికి చేరుకున్నారు. పాక్ బహిష్కరించడంతో సోమవారం ఒక్క రోజే 260మంది వలస కూలీలు అఫ్ఘాన్‌కు తిరుగుముఖం పట్టారు. మరో 2,368మంది వలస కార్మికులు ఇరాన్ నుంచి స్వదేశానికి చేరారు. కాగా.. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో వేలాదిమంది పౌరులు ఆ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే.

Similar News

News March 14, 2026

విశాఖలో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

image

AP: విశాఖ మధురవాడ(రుషికొండ) ఐటీ హిల్స్‌లో గ్రేడ్-1 ఐటీ పార్క్ రానుంది. విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హిల్-3 వెనుక ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించింది. ఈ కంపెనీ 3 దశల్లో రూ.2,200కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, దాదాపు 30,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు సమాచారం. 30లక్షల చ.అ విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు. ఇక అమరావతిలో రూ.300కోట్ల పెట్టుబడితో ‘జేవియర్’ క్యాంపస్ ఏర్పాటు కానుంది.

News March 14, 2026

అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 150 ఉద్యోగాలు

image

అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌ 150 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ కలిగి ఉండి, 21-38 ఏళ్ల మధ్య వయసు వారు అప్లై చేయొచ్చు. జీతం రూ.18,730- రూ.68,040 వరకు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ MAR 20 నుంచి ప్రారంభం. చివరి తేదీ APR-19. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు acab.bank.in చూడండి.

News March 14, 2026

వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

image

TG: మూసీ బ్యూటిఫికేషన్‌లో భాగంగా చేపడుతోన్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు వారం రోజుల్లో శంకుస్థాపన జరగనుంది. ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌లో దీనిపై చర్చించి ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. మూసీ ఒడ్డున ఉన్న 800ఏళ్ల నాటి శివాలయాన్నీ పునరుద్ధరించనుంది. ఉస్మానియా ఆస్పత్రి స్థలంలో మల్టీపర్పస్ కాంప్లెక్స్ నిర్మించనుంది. ఓ భారీ మసీదును నిర్మించేందుకు సౌదీ యువరాజు ముందుకొచ్చినట్లు సమాచారం.