News May 1, 2024
NGKL: ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా వహించాలి: ఎస్పీ

సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. SBIREWARDS కానీ లేదా SBI పేరు మీద ఉన్న ఎటువంటి లింక్లను, APPలను ఎవ్వరూ క్లిక్ చేయవద్దన్నారు. అలా క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుందని, మీ అకౌంట్స్ నుంచి డబ్బులు పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. కావున ఎవ్వరూ SBI అని ఉన్న లింక్ పైన క్లిక్ చేయోద్దని ఎస్పీ సూచించారు.
Similar News
News March 20, 2026
MBNR: రంజాన్.. బందోబస్తు ఏర్పాట్లపై నిఘా

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఇద్గా వక్ఫ్-ఎ-రహ్మానియా వద్ద అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం బందోబస్తు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్కు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News March 20, 2026
MBNR: రంజాన్.. బందోబస్తు ఏర్పాట్లపై నిఘా

మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ఇద్గా వక్ఫ్-ఎ-రహ్మానియా వద్ద అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం బందోబస్తు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్కు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News March 20, 2026
పాలమూరు: రేపే..రంజాన్ వేడుకలు!!

ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు (ఈద్-ఉల్-ఫితర్) ఈనెల 21న జరుపుకోనున్నట్లు మత పెద్దలు ప్రకటించారు. గురువారం ఆకాశంలో నెలవంక కనిపించకపోవడంతో శనివారం పండుగ నిర్వహించాలని సూచించారు. రంజాన్ మాసం నేటితో (మార్చి 20) ముగియనుందని చెప్పారు. ముస్లిం సోదరులు (నమాజ్) ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.


