News February 15, 2026

గుంటూరు జిల్లాలో శివరాత్రికి పటిష్ఠ భద్రత

image

మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు శివాలయాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. వడ్లమూడి, పెదకాకాని, పేరేచర్ల, తెనాలి, తాడేపల్లి ఆలయాల వద్ద ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

Similar News

News February 19, 2026

అమరావతిలో పలు సంస్థలకు భూములు

image

అమరావతిలో వివిధ సంస్థలకు సబ్ కమిటీ భూములు కేటాయించింది. రెయిన్‌బో ఆసుపత్రికి 2ఎకరాలు, వాతావరణ శాఖ, నాబార్డ్‌లకు ఎకరం చొప్పున స్థలాలు ఇచ్చారు. పీఎన్‌బీ, కరూర్ వైశ్యా బ్యాంకులకు కూడా భూములు దక్కాయి. మొత్తం 22 ప్రతిపాదనలు చర్చించి, 7 కొత్త సంస్థలకు ఆమోదం తెలిపారు. 11 పాత కేటాయింపుల్లో మార్పులు చేశారు. బ్యాంకు ఉద్యోగుల ఇళ్లకూ అనుమతిచ్చారు. ఇప్పటికే స్థలాలు పొందిన సంస్థల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.

News February 19, 2026

ANU: బీ ఆర్కిటెక్చర్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన బీ ఆర్కిటెక్చర్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. 5/5 బీ ఆర్కిటెక్చర్ 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు ఈ నెల 27వ తేదీలోగా అందించాలని సూచించారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.

News February 19, 2026

ANU దూరవిద్యలో 5 నూతన డిప్లమా కోర్సులు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం నూతనంగా 5 డిప్లమా కోర్సులతో ముందడుగు వేస్తుందని CDE డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ క్రమంలో ANU, అమెరికా కేంద్రంగా ఉన్న కనెక్ట్ కన్సల్టెంట్ ఐటి ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గురువారం అవగాహన ఒప్పంద కుదిరింది. సంబంధిత పత్రాలపై రిజిస్ట్రార్ సింహాచలం, కంపెనీ సీఈవో సుకుమార్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో VC గంగాధరరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.