News February 15, 2026
శివాలయాల్లో MP పార్థసారథి పూజలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హిందూపురం ఎంపీ BK పార్థసారథి పెనుగొండలోని పలు శివాలయాలను దర్శించుకున్నారు. పట్టణంలోని ముక్తేశ్వరాలయం, నాగేశ్వరాలయం, కాశీ విశ్వేశ్వర ఆలయాలతో పాటు భోగసముద్రంలోని యోగేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు సాయి కళ్యాణ్, శశిభూషణ్ పటేల్, గాడి మల్లికార్జున యాదవ్ తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Similar News
News February 22, 2026
నట్టింట్లో తల చిక్కు తీయకండి

ఇంటి మధ్య భాగాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. అక్కడ తల దువ్వితే వెంట్రుకలు రాలి ఇంట్లోనే పడతాయి. ఇల్లంతా వ్యాపిస్తాయి. తినే ఆహారంలోనూ పడే ఛాన్సుంది. వస్తువులపై పడే అవకాశం కూడా ఉంది. ఇది అశుభ్రతకు దారితీస్తుంది. ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవి నివసించే చోట ఇలా చేయకూడదు. ఇది దారిద్రానికి హేతువని పండితులు చెబుతారు. విడిగా ఒక గదిలో/బాత్రూంలో తల దువ్వుకోవాలి. తద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం.
News February 22, 2026
సూపర్-8: ‘సూర్య’సేన జోరు కొనసాగేనా?

T20 WC సూపర్-8లో నేడు 2 కీలక మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలెలో ఇంగ్లండ్, శ్రీలంక తలపడతాయి. అనంతరం అహ్మదాబాద్ వేదికగా 7pmకు భారత్, సౌతాఫ్రికా మధ్య పోరు జరగనుంది. గ్రూప్ స్టేజ్లో అన్ని మ్యాచుల్లో గెలిచిన సూర్య సేన.. అదే ఊపుతో సౌతాఫ్రికాను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ గడ్డపై టీమ్ఇండియా బ్యాటర్లు ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
News February 22, 2026
మెదక్: హాజరుకానున్న 12,334 మంది విద్యార్థులు: డీఐఈవో

మెదక్ జిల్లాలో ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు.
మొత్తం విద్యార్థులు -12,334
ఫస్ట్ ఇయర్ జనరల్ -5710
ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ -599
మొత్తం -6309
సెకండ్ ఇయర్ జనరల్ -5472
సెకండ్ ఇయర్ ఒకేషనల్- 533
మొత్తం-6025
పరీక్ష కేంద్రాలు -28
ఫ్లైయింగ్ స్క్వాడ్ -5
సిట్టింగ్ స్క్వాడ్ -4


