News May 1, 2024
రేపు కడపలో చంద్రబాబు ప్రజాగళం సభ

టీడీపీ అధినేత చంద్రబాబు రేపు కడప రానున్నారు. రేపు సాయంత్రం 5.30 గంటలకు కడప గోకుల్ లాడ్జి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా గళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కడపకు రానుండటంతో సీఎం ఇలాకాలో జగన్పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఆసక్తి నెలకొంది.
Similar News
News March 11, 2026
ఒంటిమిట్ట: మార్చి 25న పసుపు దంచే కార్యక్రమం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25న ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 27న ప్రారంభం కానున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళల అధిక సంఖ్యలో పాల్గొంటారు.
News March 11, 2026
వైవీయూ విద్యార్థి రేగులపాటి పునీత్ చిత్రానికి అవార్డ్

వైవీయు బీఎఫ్ఏ విద్యార్థి రేగులపాటి పునీత్ మెరిట్ అవార్డ్ సాధించారు. తమిళనాడులోని శ్రీ దర్శినికలై కోడం ఆర్ట్ కాలేజీ నిర్వహించిన 21వ జాతీయ స్థాయి చిత్రకళా పోటీలలో పునీత్ ఆక్రిలిక్ రంగుతో గీసిన “గ్రామీణ మహిళ “ చిత్రం ఎంపికయ్యింది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు చెన్నై లలితకళా అకాడమీ ఆర్ట్ గ్యాలరీలో చిత్రాన్ని ప్రదర్శిస్తారని ఫైన్ ఆర్ట్స్ హెడ్ మృత్యుంజయ రావు తెలిపారు.
News March 11, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,930
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,656
*వెండి 10 గ్రాముల ధర రూ.2,720


