News May 1, 2024
ఈ నెలలోనే ‘సలార్-2’ షూటింగ్ ప్రారంభం?

‘సలార్’ పార్ట్-2 షూటింగ్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. తొలి షెడ్యూల్లో 10 రోజులపాటు ప్రభాస్, పృథ్వీరాజ్లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. దీనికోసం HYDలో ప్రత్యేక సెట్ వేసినట్లు సమాచారం. తొలుత ప్రభాస్ సీన్లు పూర్తి చేసి, వచ్చే ఏడాది ఆరంభంలో మిగతా షూటింగ్ పూర్తిచేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. 2025 చివర్లో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Similar News
News March 17, 2026
SRH కెప్టెన్సీ రేసులో ఇద్దరు?

SRH జట్టులో కెప్టెన్ కమిన్స్ ఎప్పుడు చేరుతారో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మను కెప్టెన్ చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. తాజాగా ఇషాన్ కిషన్ పేరు కన్ఫర్మ్ అయిందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇషాన్కు 2016 U19 WCలో ఇండియాకు, డొమెస్టిక్ క్రికెట్లో ఝార్ఖండ్కు కెప్టెన్సీ చేసిన అనుభవముండగా, అభిషేక్ 2016 U19 ఆసియా కప్లో INDకు కెప్టెన్గా చేశారు. మరి వీరిలో SRH కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది?
News March 16, 2026
PHOTOS: శ్రీశైలం ఉత్సవాలు.. భృంగి వాహనంపై ఆది దంపతులు

AP: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు శ్రీస్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో ప్రత్యేక పూజలు అందుకున్న ఉత్సవమూర్తులకు వైభవంగా గ్రామోత్సవాన్ని జరిపించారు. గ్రామోత్సవం ముందు వివిధ కళారూపాల ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది. ఈనెల 20 వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
News March 16, 2026
200 మందికి పైగా పిల్లలు మృతి: ఇరాన్

US, ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది ఇరానియన్లు చనిపోయారని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అరాఘ్చీ తెలిపారు. ఇందులో 200 మందికి పైగా పిల్లలున్నారని వెల్లడించారు. ఇరానియన్లను చంపడాన్ని పొరుగు దేశాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ‘మేం సీజ్ఫైర్ వద్దనేది యుద్ధం కోసం కాదు. శత్రువులు మాపై మరోసారి దాడులు చేయకుండా ఉండేలా ఈ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నాం. ఇప్పటికే వారికి గుణపాఠం చెప్పాం’ అని పేర్కొన్నారు.


