News May 1, 2024

కలెక్టరేట్లో ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ: ఢిల్లీ రావ్

image

విజయవాడ కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ ఎన్నికల పర్యవేక్షకులు రాజ్ పాల్, నరేందర్ సింగ్‌తో కలిసి ఈవీఎంల రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి ర్యాండమైజేషన్‌లో ఈవీఎంలను నియోజకవర్గాలకు కేటాయించగా, 2వ ర్యాండమైజేషన్‌లో ఈవీఎంలను ఆన్లైన్లో ద్వారా పోలింగ్ స్టేషన్లకు అనుసంధానించాలని తెలిపారు.

Similar News

News April 2, 2026

కృష్ణా: బుక్ చేసిన 3- 8 రోజుల్లో సిలిండర్ల డెలివరీ: JC

image

LPG గ్యాస్ సిలెండర్ల ప్యానిక్ బుకింగ్స్ తగ్గడంతో జిల్లాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బుక్ చేసిన 3 నుంచి 8 రోజుల్లో డెలివరీలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే DCO ఆఫీస్ నంబర్ 08672-252493, రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 1, 2026

కృష్ణా జిల్లాలో మద్యం అమ్మకాల సేల్ వాల్యు విలువ ఎంతంటే..!

image

కృష్ణా జిల్లాలో ఏప్రిల్ 2025 – మార్చి 2026 మధ్య మద్యం అమ్మకాల సేల్ వాల్యు విలువలో(-2%) తిరోగమనం కనిపించింది. గత 12 నెలల్లో రూ.1,064.95 కోట్ల విలువైన 14.84 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్(IML) బాక్సులు, 6.75 లక్షల బీరు బాక్సులు అమ్ముడవ్వగా, ఏప్రిల్ 2024 – మార్చి 2025 మధ్య ఈ గణాంకాలు 13.89 లక్షలు (IML బాక్సులు), బీరు బాక్సులు 3.99 లక్షలుగా, సేల్ వాల్యూ రూ.1,083.23 కోట్లుగా నమోదైంది.

News April 1, 2026

మచిలీపట్నంలో పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ

image

మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని 7, 9 డివిజన్‌లలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పెన్షన్లు పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన కలెక్టర్ పెన్షన్ దారులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ సొమ్ము సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇప్పించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు తదితరులు ఉన్నారు.