News May 1, 2024
రుణమాఫీ తప్పకుండా చేస్తాం: మంత్రి తుమ్మల

రైతులకు రూ. 2లక్షల రుణ మాఫీని ఆగస్టు 15 లోపు ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దమ్మపేట మండలంలోని అల్లిపల్లి గ్రామంలో అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొనగా మంత్రి మాట్లాడారు. అందరి సమష్టి కృషితో పనిచేసి ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు.
Similar News
News March 13, 2026
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నంబూరి నియామకం

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నంబూరి రామలింగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధికారిక ప్రతినిధులుగా 27 మందిని నియమిస్తూ Ex.Mlc, BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందరరావు ఉత్తర్వులు జారీ చేశారు. రామచంద్రరావు, చంద్రశేఖర్ తివారి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి నెల్లూరు కోటేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా జిల్లా నుంచి వీ.పుల్లారావు యాదవ్ను సైతం నియమించింది.
News March 13, 2026
ఖమ్మం: ‘గ్రీన్ గోల్డ్’ సాగుతో రైతులకు సుస్థిర ఆర్థికాభివృద్ధి

వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు నాంది పలుకుతూ సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం విజయవంతమైంది. గురుదక్షిణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో NMPBతో పాటు కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ దిశానిర్దేశం చేశారు.
News March 12, 2026
ఏదులాపురం: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి, కలెక్టర్

ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్ పరిధిలో మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు భక్తి భావానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.


