News February 16, 2026
కోదాడ: లాకప్ డెత్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: జాతీయ ఎస్సీ కమిషన్

దళితుల రక్షణకు కమిషన్ కట్టుబడి ఉందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రరావు అన్నారు. కోదాడ లాకప్ డెత్ బాధితుడు రాజేశ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 10 రోజుల్లో రీ-పోస్టుమార్టం నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి పెన్షన్, ఇల్లు, మూడు ఎకరాల భూమి అందజేస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News February 21, 2026
ట్రాన్స్జెండర్లకు ఆర్థిక చేయూత: కలెక్టర్ రిజ్వాన్ బాషా

జిల్లాలోని ట్రాన్స్జెండర్ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శనివారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు ట్రాన్స్జెండర్లకు ఒక్కొక్కరికి రూ. 75 వేల చొప్పున మొత్తం రూ.2.25 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు 100 శాతం సబ్సిడీతో పునరావాస పథకం కింద అందజేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News February 21, 2026
ఈస్ట్ కోస్ట్ రైల్వే సరికొత్త రికార్డు

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 324 రోజుల్లోనే 250 మిలియన్ టన్నుల సరకు రవాణాను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి రైల్వే జోన్గా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 31 రోజుల ముందే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు రవాణా ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి.
News February 21, 2026
జాతీయ కబడ్డీ పోటీలకు విశాఖ ఆణిముత్యం

విశాఖలో గంగవరం ప్రాంతానికి చెందిన నోళ్లు తేజ 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఎంపికయ్యారు. ఈనెల 24 నుంచి 27 వరకు గుజరాత్లోని వడోదరలో జరిగే పోటీల్లో పాల్గొంటారు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన తేజను గాజువాక వాసులు అభినందించారు.


