News May 1, 2024
జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ చాలు: పవన్

AP: జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇక చాలని పెందుర్తి సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓటర్లకు సూచించారు. ‘శక్తియుక్తులు, ప్రతిభాపాటవాలు ఉన్న 23 మంది లక్షల యువతకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలను జగన్ ఛిన్నాభిన్నం చేశాడు. గంజాయిలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలిపాడు. మేం అధికారంలోకి వచ్చాక యువతలో ఉన్న నైపుణ్యాలను బట్టి శిక్షణ ఇస్తాం. వారికి ఉపాధి కల్పిస్తాం’ అని పవన్ స్పష్టం చేశారు.
Similar News
News March 21, 2026
పొలిటికల్ హీట్.. సొంతగూటిలో సైలెన్స్!

‘ధురంధర్-2’ రిలీజ్తో ఫిల్మ్ సర్కిల్స్లో ఓ ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఈ మూవీపై తెలుగు హీరోలు సహా పలువురు దక్షిణాది స్టార్లు ప్రశంసలు కురిపిస్తే పుట్టిల్లు అయిన బాలీవుడ్లో మాత్రం సైలెన్స్ వెంటాడుతోంది. సరైన హిట్లు లేక కరవులో ఉన్న బాలీవుడ్ ఈ హిట్ను సెలబ్రేట్ చేసుకోకపోవడంతో అక్కడి గ్రూప్ పాలిటిక్స్ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు ఇది ప్రొపగండా మూవీ అంటూ <<19436529>>రాజకీయ<<>> విమర్శలను ఎదుర్కొంటోంది.
News March 21, 2026
IPL-2026కి భారత బౌలర్ దూరం!

IPL-2026కి KKR ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ గాయం కారణంగా దూరమైనట్లు CricBuzz పేర్కొంది. ఆయన టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఫ్రాంచైజీ అధికారి ఒకరు తమతో చెప్పారని వెల్లడించింది. కాగా గత ఏడాది జరిగిన మినీ వేలంలో KKR ఆయన్ను రూ.కోటికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేసర్ హర్షిత్ రానా దూరమవ్వగా పతిరణ ఆడటంపైనా అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో కోల్కతా బౌలింగ్ లైనప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
News March 21, 2026
కాఠిన్యం వెనక కన్నీటి గాథలు.. TG పోలీస్ భావోద్వేగ ట్వీట్

కరీంనగర్ 2 టౌన్ SI చంద్రశేఖర్ సూసైడ్ పట్ల TG పోలీస్ భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు చట్టాన్ని కాపాడే కళ్లలో కన్నీటి గాథలూ ఉంటాయి. కర్తవ్యనిష్ఠతో కాలం విసిరే కర్కశత్వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. గద్దరించే గొంతు పలకని మాటల భారంతో నిశ్శబ్దం వైపు పయనించింది’ అంటూ కవిత రూపంలో నివాళులర్పించింది. భార్య దివ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా తట్టుకోలేక నేడు చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు.


