News February 17, 2026

NTR: స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణంలో గందరగోళం!

image

VJA కార్పొరేషన్ పరిధిలో స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణంలో గందరగోళం నెలకొంది. వీటి నిర్మాణానికి 2018లో కేంద్రం రూ.460 కోట్లను కేటాయించగా L&T సంస్థ పనులను చేపట్టింది. అప్పట్లో 59% పనులకు రూ.211 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 41% పనులకు రూ.600 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుత బడ్జెట్‌‌తో కొత్తగా డ్రైన్స్ నిర్మిస్తారా..? లేదా మిగిలిన పనులనే కొనసాగిస్తారా అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి.

Similar News

News April 17, 2026

సుబేదారి: ఎస్సైపై అత్యాచారం కేసు

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. కరీంనగర్ కమిషనరేట్‌లో పని చేస్తున్న ఆయన, 2025లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ కొనసాగించాడు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకొని, ఇటీవల వరంగల్‌కు వచ్చి లొకేషన్ అడిగి ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 17, 2026

యుద్ధం.. ఏవియేషన్‌కు ₹18,000 కోట్ల నష్టం!

image

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత విమానయాన రంగానికి గట్టిగా తగులుతోంది. సుమారు ₹18,000 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడబోతోందని PHDCCI నివేదిక అంచనా వేసింది. విమాన మార్గాల మళ్లింపుతో జర్నీ టైమ్ 4 గంటల వరకు పెరగడమే కాకుండా, ఇంధన ఖర్చులు తడిసి మోపెడవడం అందుకు కారణం. మరోవైపు భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా 20% వరకు పడిపోయే ప్రమాదం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

News April 17, 2026

ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ సర్జరీ పరీక్ష రద్దు

image

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 15న జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రంలో లోపాలు వెలుగుచూశాయి. 33 ప్రశ్నలు పేపర్-2కు సంబంధించినవిగా రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్షను రద్దు చేసి ఈనెల 27న తిరిగి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు.