News May 1, 2024

మరికల్: సోడా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు

image

మరికల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఫ్రూట్ జ్యూస్ సెంటర్‌లో సోడా సిలిండర్ పేలడంతో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యూస్ సెంటర్ వద్ద ప్రమాదవశాత్తు సోడా సిలిండర్ పేలింది. దీంతో జ్యూస్ తాగేందుకు నిలిచి ఉన్న ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరు కోటకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న గోపాల్ కాగా.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 17, 2026

మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్‌లో 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. హన్వాడ 7.0, నవాబుపేట 6.5, గండీడ్ మండలం సల్కర్ పేట 4.5, మిడ్జిల్ మండలం దోనూరు 2.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 1.5, బాలానగర్ 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. వర్షం కురిసిన ప్రాంతంలో వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది.

News March 17, 2026

పాలమూరు: రంజాన్ వేళ ఘుమఘుమలు..!

image

పవిత్ర రంజాన్ నెల వచ్చిందంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హలీమ్.. నోరూరించే చికెన్ హరీస్ దర్శనమిస్తాయి. ముస్లింలతో పాటు ఇతర వర్గాల వారు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. ప్రధాన రహదారుల్లో, పెద్ద హోటళ్ల ముందు నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పలుచోట్ల సాయంత్రం వేళల్లో భోజన ప్రియులు క్యూలు కట్టి మరీ తింటున్నారు. మీరు తిన్నారా? కామెంట్ చేయండి?

News March 17, 2026

ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా సాగాలి: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును కలెక్టర్ ఖుష్బూ గుప్తా
సోమవారం సందర్శించారు. సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ప్రశ్నాపత్రాల
మూల్యాంకనం పారదర్శకంగా, సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.