News May 1, 2024
UPDATE..MDK: ఆగమేఘాలతో మీటర్ ఫిట్టింగ్.. దిగొచ్చిన సయ్యద్

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన సయ్యద్ ఇంటికి విద్యుత్ అధికారులు ఆగమేఘాల మీద విద్యుత్తు మీటర్ ను బిగించారు. కొద్దిరోజులుగా విద్యుత్ మీటర్ బిగించడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కి సయ్యద్ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. SI కరుణాకర్ రెడ్డి ఆగమేఘాల మీద విద్యుత్ అధికారులతో మాట్లాడి మీటర్ ఏర్పాటు చేయించారు. దాంతో సయ్యద్ వాటర్ ట్యాంక్ మీద నుంచి దిగి వచ్చారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News March 19, 2026
మెదక్: విషాదం.. వ్యక్తి సూసైడ్

నిజాంపేట మండల కేంద్రంలో అప్పుల బాధ తాళలేక పంజా సత్తయ్య(46) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త ఇల్లు నిర్మించడంతో అప్పులు పెరిగి, తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 19, 2026
ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 19, 2026
ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


