News May 1, 2024
IPL-2024: కోహ్లీని దాటేసిన గైక్వాడ్

ఐపీఎల్-2024లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రుతురాజ్ గైక్వాడ్(509) కొనసాగుతున్నారు. పంజాబ్ కింగ్స్తో మ్యాచులో 62 రన్స్తో రాణించి ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న కోహ్లీని (500) అధిగమించారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా సాయి సుదర్శన్ 418, కేఎల్ రాహుల్ 406, పంత్ 398, సాల్ట్ 392, శాంసన్ 385, నరైన్ 372 ఉన్నారు.
Similar News
News February 1, 2026
ఇది చారిత్రాత్మక బడ్జెట్: ప్రధాని మోదీ

2026-27 కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమని అని ప్రధాని మోదీ ప్రశంసించారు. 2047 వికసిత్ భారత్ ఆశయాలకు ఈ బడ్జెట్ దోహద పడుతుందని అన్నారు. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేలా దీనిని రూపొందించారని పేర్కొన్నారు. హైకేపెక్స్, హైగ్రోత్ను సమన్వయం చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. బయోఫార్మా శక్తి మిషన్, సెమీకండక్టర్ మిషన్ 2.0, రేర్ ఎర్త్ కారిడార్ మొదలైనవి ప్రకటించడం అభినందనీయమన్నారు.
News February 1, 2026
ట్యాక్స్ శ్లాబ్లలో మార్పు లేదు.. పాతవే కంటిన్యూ!

బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి మార్పులు లేవు. పాత శ్లాబ్లనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పన్ను విధానం కింద గతంలో ఉన్నట్లే స్టాండర్డ్ డిడక్షన్ ₹75,000తో కలిపి ₹12.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను సున్నా. ఆ పరిమితి దాటితే ₹4 లక్షల వరకు-0%, ₹4-8 లక్షలు-5%, ₹8-12 లక్షలు-10%, ₹12-16 లక్షలు-15%, ₹16-20లక్షలు-20%, ₹20-24 లక్షలు-25%, ₹24 లక్షల పైన-30% పన్ను కట్టాలి.
News February 1, 2026
TTD EO సింఘాల్ బదిలీ..రవిచంద్రకు బాధ్యతలు

AP: TTD EO అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో CM ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదని, చర్యలు చేపట్టాలని CBI SIT నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. తక్షణమే అదనపు EO వెంకయ్య చౌదరికి బాధ్యతలు అప్పగించాలని, జీఏడీలో రిపోర్టు చేయాలని సింఘాల్ను ఆదేశించింది.


