News May 2, 2024
అవేవీ ఈసీకి కనిపించవు, వినిపించవు: హరీశ్

TG: ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొడితే ఈసీకి కనిపించదని, సీఎం రేవంత్ బూతులు మాట్లాడితే వినిపించదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ ప్రశ్నిస్తే మాత్రం ఆపుతున్నారని మండిపడ్డారు. ఆయన బస్సు యాత్ర చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు భయపడుతున్నారని అన్నారు. నిషేధం విధించినా ప్రజల గుండెల నుంచి కేసీఆర్ను వేరు చేయలేరని హరీశ్ స్పష్టం చేశారు.
Similar News
News January 31, 2026
Dy.CMగా సునేత్ర.. నాకేం తెలియదన్న శరద్ పవార్!

దివంగత నేత అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్ MH Dy.CMగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని NCP(SP) అధినేత శరద్ పవార్ అన్నారు. ఆ నిర్ణయంతో తనకు సంబంధం లేదని చెప్పారు. అజిత్ పవార్ ఆశయం మేరకు NCP రెండు వర్గాలు ఏకమవ్వాలని చర్చలు జరిగాయని, కానీ ఆయన అకాల మరణం తీరని లోటని పేర్కొన్నారు. విలీనం ఖాయమనుకున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
News January 31, 2026
బంగారం, వెండి ధరలు తగ్గడానికి ఈయనే కారణం!

బంగారం, వెండి ధరలు కుదేలవ్వడానికి ప్రధాన కారణం కెవిన్ వార్ష్. ఈయన US సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్ కానున్నారు. ట్రంప్ ఆయనను నామినేట్ చేయడంతో మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్గా పనిచేసిన వార్స్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా ఉంటారు. డాలర్ బలోపేతానికే పెద్దపీట వేస్తారన్న అంచనాలు ఇన్వెస్టర్లను భయంలోకి నెట్టాయి. భారీగా అమ్మకాలు చేపట్టడంతో ధరలు కుప్పకూలాయి.
News January 31, 2026
మానవ శక్తి కేంద్రాల గురించి తెలుసుకుందామా?

మన శరీరం అనంత శక్తికి నిలయం. ఇందులో వెన్నుపూస వెంబడి 7 శక్తి కేంద్రాలుంటాయి. వీటినే సప్త చక్రాలు అంటారు. ఇవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని నియంత్రిస్తాయి. ఈ చక్రాలను సమతుల్యం చేయడానికి రత్నాలను ధరించడం, కొన్ని పరిహారాలు పాటించడం ఎంతో మేలు చేస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. వీటిని సమగ్రంగా నిర్వహించకపోతే నష్టం కూడా జరుగుతుందట. వీటి గురించిన పూర్తి వివరాలను మున్ముందు తెలుసుకుందాం.


