News February 17, 2026
నిజామాబాద్ జిల్లాలో భైంసా వాసి మృతి

భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన పాట్రోల్ల మాణిక్యం (38) నిజామాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. పశువులను మేపేందుకు ముగ్పాల్ మండలం చిన్నాపూర్ శివారుకు వెళ్లిన మాణిక్యం.. అక్కడ హన్మాన్ చెరువులో దిగగా లోతు తెలియక మునిగిపోయాడు. సమాచారం అందుకున్న ముగ్పాల్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు. భైంసా వాసి పక్క జిల్లాలో మృతి చెందడంతో దేగాం గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News February 20, 2026
మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఉర్దూ పాఠశాలలు: డీఈవో

రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ప్రభుత్వం ముస్లింలకు శుభవార్త చెప్పింది. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల నేపథ్యంలో ఉర్దూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పని చేస్తాయని అనంతపురం డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. రంజాన్ మాసం ముగిసిన తర్వాత పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.
News February 20, 2026
Stocks: నష్టాల్లోంచి లాభాల్లోకి..

నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ ఇవాళ కూడా రెడ్లో మొదలైన స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. వాల్యూ బయింగ్లో భాగంగా ఇన్వెస్టర్లు మెటల్, బ్యాంక్ స్టాక్స్పై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో సెన్సెక్స్ క్రమంగా లాభాల్లోకి వచ్చి ప్రస్తుతం 400 పాయింట్లు గ్రీన్లో కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 143 పాయింట్లు లాభాల్లో ఉంది.
News February 20, 2026
DRDOలో JRF పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

బెంగళూరు <


