News May 2, 2024

రూ.24 లక్షలు ఇప్పిస్తా: ఆది నారాయణ రెడ్డి

image

తాను MLAగా గెలిస్తే రాజోలు ప్రాజెక్టులో భూ నిర్వాసితులకు రూ.24 లక్షలు, గండికోట భూ నిర్వాసితులకు రూ.12లక్షలు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. పెద్దముడియం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లకు రిపేర్లు ఉన్నాయా, తాగునీరు, సాగునీరు, ఇళ్లు, డ్రిప్ ఇలా ఏ ఒక్కటైనా చేశావా’ అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Similar News

News March 22, 2026

జమ్మలమడుగు యువకుడికి ఆల్ ఇండియా ర్యాంక్

image

జమ్మలమడుగు (M) ఎస్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్ గేట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో మెకానికల్ ఇంజినీరింగ్ (ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్) విభాగంలో ఆల్ ఇండియా 89వ ర్యాంక్ సాధించి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మోహన్ తల్లిదండ్రులు సంజీవరాయుడు, లక్ష్మీదేవి, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.

News March 22, 2026

ఒంటిమిట్టలో ఆక్రమణలు తొలగిస్తారా..?

image

ఒంటిమిట్ట కోదండరామాలయంలోని పంచాయతీ స్థలాలు ఆక్రమణలు పరిపాటిగా మారాయి. ప్రజలు, భక్తులు నడిచే కాలినడక బాటను సైతం దుకాణాల పేరుతో వదిలారన్నారు. మండల అధికార యంత్రానికి విషయం తెలిసినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అక్రమణలపై చేయి కుడా వేయలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లను జయించి అధికార యంత్రాగం ఆక్రమణలు తొలగిస్తుందా.. లేక ఎప్పటిలాగే కళ్లుమూసుకుంటుందా వేచి చూడాలని విశ్లేషకులు అంటున్నారు.

News March 22, 2026

కడప: MP మహేశ్‌కు మద్దతుగా బ్యానర్లు

image

కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు MP పుట్టా మహేశ్ యాదవ్‌కి మద్దతుగా కడప జిల్లాలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. మైదుకూరు నియోజకవర్గం మొర్రాయిపల్లి రోడ్డులో న్యాయం నిలుస్తుంది, నిజాయితి గెలుస్తుంది.. వీ స్టాండ్ విత్ పుట్టా మహేశ్, ఇట్లు చాపాడు మండల ప్రజలు అనే వాక్యాలతో బ్యానర్‌లో రాసి ఉంది.