News February 18, 2026
ఖమ్మంలో సదరం శిబిరం ఏర్పాట్లపై ఆరా

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సదరం (SADAREM) బ్లాక్ను అడిషనల్ కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. రాబోయే శిబిరం కోసం జరుగుతున్న సివిల్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని, శిబిరానికి వచ్చే దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 19, 2026
ఖమ్మం: భోజనం చేస్తూ వ్యక్తి గుండెపోటుతో మృతి

కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన శ్రీను (38) మణుగూరులోని బంధువుల ఇంట్లో భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీను ఆకస్మిక మరణంతో దుబ్బతండా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
News February 19, 2026
సన్నబియ్యం పంపిణీలో పోర్టబిలిటీ తిప్పలు

ఖమ్మం జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రక్రియలో లబ్ధిదారులు, డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోర్టబిలిటీ సౌకర్యం కారణంగా ఇతర ప్రాంతాల వారు రావడంతో స్థానిక కార్డుదారులకు బియ్యం అందక డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. అక్రమాలను అరికట్టేందుకే ‘స్లాబ్’ విధానం అమలు చేస్తున్నామని అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇండెంట్ ప్రకారమే బియ్యం కేటాయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
News February 19, 2026
ధరణి వెనుక ‘పెద్ద’ కుట్ర.. డొంక కదిలింది: పొంగులేటి

ధరణి పోర్టల్ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల అసలు రంగు బయటపడుతోందని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. సచివాలయంలో ధరణిపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీతో ఆయన సమీక్షించారు. “తీగ లాగితే డొంక కదిలినట్లు” అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నారు. గత పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం పోర్టల్లోని లొసుగులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టారని ఆరోపించారు.


