News May 2, 2024
MHBD:కేసీఆర్ యాత్రలో హైలైట్స్ ఇవే..

బతుకమ్మలు, కోలాటాలతో కేసీఆర్కు శ్రేణులు స్వాగతం పలికాయి. సభలో కేసీఆర్ 14 నిమిషాలు ప్రసంగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ తాను స్వయంగా తయారుచేసిన అరిసెలు, గారెలు కేసీఆర్కు అందజేశారు. సభ ముగిశాక ఎంపీ కవిత, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే హరిప్రియం బస్సుపై డ్యాన్స్ వేశారు. ఎంపీ కవిత నివాసానికి మొదటిసారి వచ్చిన కేసీఆర్కు కవిత మిత్రురాలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు.
Similar News
News January 8, 2026
WGL: సన్న వడ్ల బోనస్ బకాయిలు రూ.54 కోట్లు!

జిల్లాలో సన్న వడ్ల బోనస్ బకాయిలు రూ.54 కోట్ల మేర ఉన్నాయి. 15,311 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయగా, మరో 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎస్ఎస్పీ కింద రూ.346.3 కోట్లను రైతులకు చెల్లించగా, మరో రూ.20 కోట్లను చెల్లించాల్సి ఉంది. సన్న వడ్ల బోనస్ కింద రూ.75.2 కోట్లను చెల్లించాల్సి ఉండగా, రూ.21.2 కోట్లను మాత్రము ప్రభుత్వం చెల్లించింది.
News January 7, 2026
జూనియర్ కాలేజీలకు డిజిటల్ టీవీలు: వరంగల్ DIEO

వరంగల్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ టీవీలు పంపిణీ చేసినట్లు DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య ఆదేశానుసారం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ బోధనకు ఉపకరించే సామాగ్రి అందించినట్లు వెల్లడించారు. నేడు గీసుకొండ కళాశాలకు అందించామన్నారు. ఒక్కో కళాశాలకు రూ.6లక్షలకు పైగా విలువైన డిజిటల్ సామాగ్రి పంపిణీ చేశారన్నారు.
News January 7, 2026
WGL మార్కెట్లో చిరుధాన్యాల ధరల్లో స్వల్ప తేడాలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్కి బుధవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.8,850 ధర రాగా..ఈరోజు రూ.8,700కి తగ్గింది. అలాగే పచ్చి పల్లికాయకి మంగళవారం రూ.5,500 ధర వస్తే.. నేడు రూ.5,970 అయింది. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,080 పలికితే.. నేడు రూ.2,060 పలికింది. దీపిక రకం మిర్చికి మంగళవారం రూ. 16,500 ధర ఉంటే..ఈరోజు రూ.17,500 అయినట్లు వ్యాపారులు తెలిపారు.


