News May 2, 2024
విజయనగరం: ఈనెల 15 నుంచి వేసవి క్రీడా శిబిరాలు

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహించాలనుకున్న వేసవి శిక్షణ శిబిరాలను ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ శిబిరాలు వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయసు గల బాల, బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 6, 2026
VZM: ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ

ఏపీ సివిల్ సర్వీసెస్ డైరీని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీను విడుదల చేసి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ పరిపాలనలో రోజువారీ కార్యక్రమాలు, పరిపాలన సంబంధిత అంశాలను నమోదు చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డీఆర్ఓ మురళీ, తదితరులున్నారు.
News March 5, 2026
VZM: మిషన్ హార్టీ విజన్తో ఉద్యాన సాగు విస్తరణ

జిల్లాలో మిషన్ హార్టీ విజన్ అమలు ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించి రైతులకు నిరంతర ఆదాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్లో అదనంగా 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
News March 5, 2026
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO

వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవన రాణి సూచించారు. విజయనగరంలోని తన కార్యాలయం ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలో తిరగకూడదని, తగినంత నీరు తాగాలన్నారు.


