News February 19, 2026
యాదాద్రి జిల్లాలో బ్యాంకు అధికారుల సమావేశం

భువనగిరిలోని మినీ మీటింగ్ హాల్లో కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం ఈజీపీ, పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి వంటి పథకాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ పథకాలకు సంబంధించిన రుణ ప్రక్రియను బ్యాంకు ఉద్యోగులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు సకాలంలో అందేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.
Similar News
News February 23, 2026
HYD: పోలీసులకు దొరికితే హెల్మెట్ ఫ్రీ.. Conditions Apply!

హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREEగా హెల్మెట్ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24 గంటల్లోపు సొంతంగా హెల్మెట్ కొనుక్కుని పోలీసుల వద్ద తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి. చలాన్ల కన్నా ప్రాణ రక్షణే ముఖ్యం అని పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
News February 23, 2026
HYD: పోలీసులకు దొరికితే హెల్మెట్ ఫ్రీ.. Conditions Apply!

హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREEగా హెల్మెట్ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24 గంటల్లోపు సొంతంగా హెల్మెట్ కొనుక్కుని పోలీసుల వద్ద తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి. చలాన్ల కన్నా ప్రాణ రక్షణే ముఖ్యం అని పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
News February 23, 2026
ఖమ్మం: ‘వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు సిద్ధం’

రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. ఇప్పటికే గరిష్ఠ డిమాండ్ 5,904మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. అదనంగా 110కొత్త ట్రాన్స్ఫార్మర్లు, మంచుకొండ వద్ద కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓవర్ లోడ్ సమస్య లేకుండా సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


