News February 19, 2026
సిద్దిపేట: రూ.500 గ్యాస్ రాయితీ.. ఎదురుచూపులు!

సిద్దిపేట జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు రూ.500 రాయితీ డబ్బులు కోసం 6 నెలలుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్ను అమలు చేస్తుంది. అయితే పథకం ప్రారంభంలో ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ చేసినా 6 నెలలుగా జమ కావడం లేదని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. జిల్లాలో 79 వేల లబ్ధిదారులు ఉన్నారు. మరి మీకు సబ్సిడీ పడుతుందా కామెంట్.
Similar News
News April 17, 2026
యుద్ధం.. ఏవియేషన్కు ₹18,000 కోట్ల నష్టం!

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత విమానయాన రంగానికి గట్టిగా తగులుతోంది. సుమారు ₹18,000 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడబోతోందని PHDCCI నివేదిక అంచనా వేసింది. విమాన మార్గాల మళ్లింపుతో జర్నీ టైమ్ 4 గంటల వరకు పెరగడమే కాకుండా, ఇంధన ఖర్చులు తడిసి మోపెడవడం అందుకు కారణం. మరోవైపు భారత్కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా 20% వరకు పడిపోయే ప్రమాదం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
News April 17, 2026
ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ సర్జరీ పరీక్ష రద్దు

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 15న జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రంలో లోపాలు వెలుగుచూశాయి. 33 ప్రశ్నలు పేపర్-2కు సంబంధించినవిగా రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్షను రద్దు చేసి ఈనెల 27న తిరిగి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు.
News April 17, 2026
ఉమ్మడి వరంగల్లో జనాభా వివరాలు ఇలా..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 36,88,217 మందిగా సర్వేలో తేలింది. ఇందులో వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 8,36,811 మంది ఉండగా, మహబూబాబాద్ 8,04,515, హనుమకొండ 7,99,448, జనగామ 5,45,449, జయశంకర్ భూపాలపల్లి 4,07,896, ములుగు జిల్లాలో అత్యల్పంగా 2,94,098 మంది ఉన్నారు. కేటగిరీల వారీగా బీసీలు 18,37,374తో ముందుండగా, ఎస్సీలు 7,07,161, ఎస్టీలు 6,74,725, ఓసీలు 2,94,517 మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది.


