News February 19, 2026
జంగంపల్లి చెరువులో పడి వ్యక్తి మృతి

బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన మహమ్మద్ నవాజ్ (40) చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపారు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 25, 2026
‘జెన్ జీ’ వల్ల రూ.76లక్షల కోట్లు నష్టం!

ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ పరిశ్రమ నాలుగేళ్లలో 839 బిలియన్ డాలర్ల(రూ.76లక్షల కోట్లు) మార్కెట్ విలువను కోల్పోయింది. దీనికి కారణం <<17942790>>‘జెన్ జీ’<<>> యువతలో వస్తున్న జీవనశైలి మార్పులేనని పలు నివేదికలు చెబుతున్నాయి. మునుపటి తరాలతో పోలిస్తే జెన్ జీలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తూ మద్యానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆల్కహాల్ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతోంది.
News February 25, 2026
నరసాపురం: వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

నరసాపురం మండలం వేములదీవి పడమరలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. బుధవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన బొమ్మిడి యేసుబాబు(53) అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే నరసాపురం తహశీల్దార్ ఐవీవీ సత్య నారాయణ, ఆర్ఐ సురేఖ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News February 25, 2026
చెరకు పంటలో పీక, కాండం తొలుచు పురుగు ప్రభావం

చెరకు నాటిన దగ్గరి నుంచి నరికే వరకు ఈ పురుగులు పైరును ఆశిస్తాయి. బాల్య దశలో పీకపురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా పంటను నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధార చెరకుపై ఎక్కువగా ఉంటుంది. దీని ఉద్ధృతి ఎక్కువైతే పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పురుగుల విషయంలో నిర్లక్ష్యం వద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


