News May 2, 2024
అనంత: మరో 3 నెలలు తిరుపతి- కదిరిదేవరపల్లి రైలు రద్దు

రాయదుర్గం మీదుగా ప్రయాణించే తిరుపతి-కదిరిదేవరపల్లి రైలును మరో మూడు నెలల పాటు రద్దుచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 07589 నంబరు రైలును జులై 31 వరకు, 07590 రైలును ఆగస్టు 1వ తేదీ వరకు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కారణంగా ఈ రైలును రద్దు చేస్తున్నట్లు ప్రతి నెలా రైల్వే అధికారులు ప్రకటనలిస్తున్నారు. జనవరి నుంచి జులై వరకు ఈ రైలును పలు కారణాలతో రద్దు చేశారు.
Similar News
News March 29, 2026
నేడు ఎల్లనూరు మండలానికి హీరో విజయ్ దేవరకొండ రాక

ఎల్లనూరు మండలంలో నేడు హీరో విజయ్ దేవరకొండ పర్యటించనున్నారు. మండల పరిధిలోని జంగంపల్లి కోట వద్ద ‘రణబలి’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అందుకు తగ్గ ఏర్పాట్లను సిద్ధం చేశారు. పుట్లూరు సీఐ సత్యబాబు బందోబస్తు చేపట్టారు.
News March 29, 2026
నేడు ఎల్లనూరు మండలానికి హీరో విజయ్ దేవరకొండ రాక

ఎల్లనూరు మండలంలో నేడు హీరో విజయ్ దేవరకొండ పర్యటించనున్నారు. మండల పరిధిలోని జంగంపల్లి కోట వద్ద ‘రణబలి’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అందుకు తగ్గ ఏర్పాట్లను సిద్ధం చేశారు. పుట్లూరు సీఐ సత్యబాబు బందోబస్తు చేపట్టారు.
News March 28, 2026
SKU వైస్ ఛాన్స్లర్గా జ్యోతి కుమార్ బాధ్యతలు

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్లర్గా NVR జ్యోతి కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా పని చేస్తున్న ఈయనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ నెల 13న వైస్ ఛాన్స్లర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్లర్గా కొనసాగనున్నారు.


