News May 2, 2024

యువరాజును ప్రధాని చేయడానికి పాక్ తహతహలాడుతోంది: మోదీ

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీ ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో PM మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ‘పాకిస్థాన్, కాంగ్రెస్ మధ్య బంధం బయటపడింది. మైక్రోస్కోప్‌లో వెతికినా దేశంలో కాంగ్రెస్ కనబడట్లేదు. యువరాజు ప్రధాని కావాలని పాక్ నేతలు ప్రార్థనలు చేస్తున్నారు. ఏ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నారో దానిని మీ హయాంలో జమ్మూకశ్మీర్‌లో ఎందుకు అమలు చేయలేదు’ అని ప్రశ్నించారు.

Similar News

News March 15, 2026

ఇలా అయితే SRHకు ఇబ్బందులు తప్పవు: పుజారా

image

SRHలో అభిషేక్, హెడ్, క్లాసెన్ లాంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నప్పటికీ అనేక లోపాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ పుజారా తెలిపారు. ‘ఆ ముగ్గురు ఔటవగానే జట్టును ముందుకు తీసుకెళ్లే ప్లేయర్ కనపడటం లేదు. దీన్ని ప్రత్యర్థి జట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. అలాగే SRH హోంగ్రౌండులో మినహా మిగతా మైదానాల్లో ప్రదర్శన పేలవంగా ఉంది. ఈ అంశాలపై మేనేజ్‌మెంట్ దృష్టిసారించకపోతే ఇబ్బందులు తప్పవు’ అని పేర్కొన్నారు.

News March 15, 2026

జనగణనకు 76వేల మంది టీచర్లు

image

TG: మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే తొలిదశ <<19385989>>జనగణనకు<<>> 76వేల మంది టీచర్లను వినియోగించుకుంటామని సెన్సస్ డైరెక్టర్ భారతి చెప్పారు. పనితీరును పరిశీలించేందుకు ప్రతి 6-7 మంది ఎన్యూమరేటర్లకు ఓ సూపర్ వైజర్, రాష్ట్రవ్యాప్తంగా 762 మంది ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. పౌరులే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేందుకు APR 26-మే 10 వరకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్/యాప్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

News March 15, 2026

ఎగుమతులు బంద్.. పడిపోతున్న బియ్యం ధరలు

image

TG: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్ నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంపై ప్రభావం పడుతోంది. క్రమంగా ధరలు పడిపోతున్నాయి. ఈ నెల 8న దొడ్డు ధాన్యం ధర క్వింటా ₹2,550 ఉండగా ప్రస్తుతం ₹2,450కి తగ్గింది. మరో ₹150 వరకు తగ్గే ఛాన్స్ ఉందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌లో మరో 145L టన్నుల బియ్యం మార్కెట్లోకి రానుందని, ఎక్స్‌పోర్ట్ ఆగిపోయినందున కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని పేర్కొంటున్నారు.