News February 21, 2026

ఉమ్మడి NZB జిల్లాల్లో షట్టర్ గ్యాంగ్ హల్‌చల్

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో నెల రోజుల్లోనే 5 భారీ చోరీలు జరగడంతో ప్రజలు వణుకుతున్నారు. తాళం వేసిన ఇళ్లు, షట్టర్లే లక్ష్యంగా నలుగురు సభ్యుల ముఠా మారణాయుధాలతో తిరుగుతూ నగదు, బంగారం దోచుకెళ్తోంది. జనవరి 10న ఏకకాలంలో 5 దుకాణాల్లో చోరీకి పాల్పడటం సంచలనం రేపింది. సీసీ కెమెరాల ఆధారంగా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 23, 2026

ఖమ్మం ఎంసీహెచ్‌లో తగ్గుతున్న ప్రసవాలు

image

ఒకప్పుడు నెలకు వెయ్యికి పైగా డెలవరీలతో రికార్డు సృష్టించిన ఖమ్మం MCH ప్రస్తుతం వెలవెలబోతోంది. వైద్యుల సమయపాలన లోపం, పర్యవేక్షణ కరువవ్వడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కలెక్టర్ సమీక్ష నిర్వహించి.. గైనకాలజీ విభాగం వైద్యులు సమయపాలన పాటిస్తూ, పర్యవేక్షణ పెంచాలని గట్టిగా ఆదేశించారు.

News February 23, 2026

అనకాపల్లి: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని మోడల్స్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. విద్యార్థులు ఈనెల 23 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

News February 23, 2026

ఖమ్మం జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు!

image

ఖమ్మం జిల్లాలో వేసవి రాకముందే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే 2 అడుగుల మేర నీటిమట్టం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఎర్రుపాలెం, మధిర, కామేపల్లి మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. విచ్చలవిడి వాడకం, నీటి పొదుపు లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. మే నాటికి జల సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని భూగర్భజల శాఖ హెచ్చరిస్తోంది.