News May 2, 2024

కాకినాడ: వాగులో మునిగి ఇద్దరు యువకుల మృతి

image

కాకినాడ జిల్లా సామర్లకోటలో విషాదఛాయలు అలుముకున్నాయి. బ్రౌన్‌పేటలోని గణేశ్‌కాలనీకి చెందిన ఇద్దరు యువకులు రంపచోడవరం సమీపంలోని సీతపల్లి వాగులో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గురువారం సామర్లకోట నుంచి సీతపల్లి వాగుకు 13మంది యువకులు విహారయాత్రకు వెళ్లారు. వారిలో గణేష్ కాలనీకి చెందిన ఇద్దరు యువకులు నీటిలో దిగగా.. ఊబీలో కూరుకుపోయి మృతి చెందినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 7, 2025

రాజమండ్రి: నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా

image

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్మానుష్య ప్రాంతాల్లో సోమవారం డ్రోన్‌తో నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి, నేరాలను కట్టడి చేయడానికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News July 7, 2025

రాజమండ్రి: పీజీఆర్ఎస్‌కు 216 అర్జీలు

image

తూ.గో జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో మొత్తం 216 అర్జీలు అందినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అర్జీదారుల సమస్యల పరిష్కారం, వారి సంతృప్తి స్థాయిని తెలుసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News July 7, 2025

రాజమండ్రి: పీజీఆర్ఎస్‌కు 35 అర్జీలు

image

రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 35 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వాటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, దొంగతనం కేసులు, ఇతర కేసులకు సంబంధించిన అర్జీలు ఉన్నాయని అధికారులు తెలిపారు.