News May 2, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

పుట్టపర్తి రూరల్ మండల పరిధిలోనీ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం పుట్టపర్తి మండలంలోని నిడిమామిడి, రాచువారి పల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయా గ్రామాలలో గత ఎన్నికలలో తలెత్తిన ఘటనలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా గొడవలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా వేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Similar News

News March 10, 2026

యుద్ధ ప్రభావంతో ఆగిన అరటి ఎగుమతులు

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం అనంతపురం జిల్లా అరటి రైతులపై తీవ్రంగా పడింది. ఇరాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో టన్ను ధర రూ.22 వేల నుంచి రూ.9 వేలకు పడిపోయింది. వ్యాపారస్తులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో తోటల్లోనే పంట పండిపోతోంది. పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొనడంతో రైతులు దిగులు చెందుతున్నారు. గిట్టుబాటు ధర లేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

News March 10, 2026

అనంత: ఉద్యోగుల సీనియారిటీ లిస్టులో తప్పులు..!

image

స్వర్ణ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ లిస్ట్‌లో తప్పులు ఉన్నట్లు రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాయలసీమ అధ్యక్షుడు ఆదినారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో PGRS కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులకు వారు వినతి ఇచ్చారు. సీనియార్టీ లిస్టును సరిదిద్ది రిజర్వేషన్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు.

News March 9, 2026

అనంత: YCP సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్

image

ITDP నాయకురాలు జె.రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన అనంతపురం (D) మద్దెలచెరువుకు చెందిన YCP సోషల్ మీడియా కన్వీనర్ మదిగుబ్బ అశోక్‌ను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. TTD ఛైర్మన్ BR నాయుడు వ్యవహారంలో రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన అశోక్‌ను అరెస్ట్ చేసినట్లు CI నాయబ్ రసూల్ తెలిపారు. నిందితుడు సయ్యద్‌ను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి విధితమే.