News May 2, 2024

రేపు 3 సెగ్మెంట్లలో సీఎం జగన్ ప్రచారం

image

AP: సీఎం, వైసీపీ అధినేత జగన్ రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని పున:ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు నరసాపురం, మధ్యాహ్నం 12.30 గంటలకు క్రోసూరు, మధ్యాహ్నం 3 గంటలకు కనిగిరి పామూరు బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించే సభల్లో ప్రసంగిస్తారు. కాగా ఇవాళ ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన ఆయన.. రీజినల్ కోఆర్టినేటర్లతో కీలక అంశాలపై చర్చించారు.

Similar News

News March 5, 2026

సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి: సీఎం

image

AP: డబ్బులు ఉన్న వారు ఎందుకు తక్కువ మంది పిల్లలను కంటున్నారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఇప్పటికీ పేదవారే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. అందుకే తల్లికి వందనం పథకం అందరికీ ఇచ్చాం. సరైన సమయంలో పెళ్లిళ్లు జరగాలి. ఈ రోజుల్లో విడాకులు కూడా ఎక్కువ అయిపోయాయి. భార్యాభర్తలకు సహనం లేకుండా పోయింది. సామాజిక సమస్యలపై మనం మాట్లాడితేనే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది’ అని తెలిపారు.

News March 5, 2026

లోన్‌పై బండి కొన్నారా? ఆ ఇబ్బంది ఉండదిక!

image

లోన్‌పై వెహికల్ తీసుకుంటే ఉండే హైపోథికేషన్ మార్క్ తొలగింపు ఇక ఈజీ కానుంది. రుణ చెల్లింపు పూర్తయితే RTOకు ఆన్‌లైన్లో బ్యాంకులు సమాచారం అందిస్తే ఆటోమేటిక్‌గా అప్డేట్ అయ్యే ఫీచర్‌ను కేంద్ర రవాణా శాఖ ప్రారంభించింది. SBI, 5 NBFCలతో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ సౌకర్యాన్ని త్వరలో అన్ని బ్యాంకులకూ విస్తరించనుంది. ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చే నో డ్యూ కాపీలు RTO ఆఫీసులకు వెళ్లి ఇస్తే ఇది పోతుంది.

News March 5, 2026

హార్ముజ్ జలసంధిలో 23వేల మంది ఇండియన్స్!

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. దీంతో గల్ఫ్ రీజియన్‌లో 36 ఇండియన్ కార్గో షిప్స్ నిలిచిపోయాయి. వీటిలో LPG, LNG క్యారియర్స్, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్, కంటెయినర్ షిప్స్ ఉన్నాయి. ఈ క్రమంలో వాటిలో 23 వేల మంది ఇండియన్ సైలర్స్ చిక్కుకుపోయినట్లు సమాచారం. ఒమన్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.