News May 2, 2024

చాపాడు: ‘వైసీపీ కార్యకర్త కాలు విరిచిన TDP నాయకులు’  

image

మైదుకూరులో నిన్న సీఎం జగన్ సిద్ధం సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వెళ్లాడే కారణంతో ఖాదరపల్లెకు చెందిన యాపరాలపల్లె జాఫర్‌ను గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు వివరాల మేరకు జాఫర్ మంగళవారం సీఎం జగన్ సభకు హాజరయ్యారు. దీంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ వ్యక్తులు ఫకృద్దిన్, లాల్ బాషాలు మెడపై కత్తి ఉంచి సభకు ఎందుకు వెళ్లావని బెదిరించి కాలు విరిచారని తెలిపారు.

Similar News

News March 12, 2026

కడప: ‘సీఐ అశోక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు’

image

కడప జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పనిచేసిన సీఐ అశోక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూమి సెటిల్‌మెంట్లు, ఇతర అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై ఆధారాలు లభ్యమవ్వడంతో సీఐ అశోక్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. కాగా ఆయన గత రెండేళ్లుగా వీఆర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

News March 12, 2026

నెల రోజుల్లోగా స్మార్ట్ కిచెన్ పనులు పూర్తి చేస్తాం: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 33 స్మార్ట్ కిచెన్ల నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎం చంద్రబాబుకు వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

News March 12, 2026

కడప జిల్లాలో MSPతో శనగ పంట సేకరణ ఎంతంటే.!

image

కడప జిల్లాలో బుధవారం నాటికి 2438 మంది రైతుల నుంచి MSPతో 9963MTల శనగలను సేకరించారు. పెద్దముడియం-727, జమ్మలమడుగు-593, మైలవరం-267, ఎర్రగుంట్ల-782, కొండాపురం-335, ముద్దనూరు-822, ప్రొద్దుటూరు-630, రాజుపాలెం-724, కమలాపురం-1120, వల్లూరు-532, పెండ్లిమర్రి-811, VNపల్లె-603, పోరుమామిళ్ల-145, దువ్వూరు-93, వేంపల్లె-332, వేముల-530, సింహాద్రిపురం-217, తొండూరు-176, లింగాల-255, పులివెందుల-262MTలు సేకరించారు.