News May 2, 2024

నిజామాబాద్: నగదు కట్టలు పట్టివేత 

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిజమాబాద్ గంజి మార్కెట్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలో రూ.4 లక్షలు పట్టుబడ్డాయని వన్ టౌన్ SHO విజయ్ బాబు తెలిపారు. నేతి శ్రావణ్ అనే వ్యక్తి వద్ద నుంచి ఈ నగదు స్వాధీనం చేసుకున్నామని, వీటికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలు చూపించనందున డబ్బును స్వాధీనపరచుకున్నట్లు SHO వివరించారు.

Similar News

News March 25, 2026

NZB: మహిళా కోటాలో ఓబీసీ మహిళకు సబ్ కోటా ఇవ్వాలి: కవిత

image

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు భారతీయ ఆడబిడ్డల దశాబ్దాల కల అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ బిల్లుకు చట్టబద్దత కోసం జాగృతి అవిశ్రాంత పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో ఆ కోటాలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సబ్ కోటా ఇవ్వకుంటే ఆయా వర్గాల ఆడబిడ్డలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కదని ట్వీట్ చేశారు.

News March 25, 2026

నిజామాబాదు: ఇంటర్ తర్వాత ఏ కోర్సు మేలు?

image

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సుమారు 35 వేల మంది విద్యార్థులు తమ తదుపరి అడుగుల కోసం సిద్ధమవుతున్నారు. మార్కెట్ డిమాండ్ దృష్ట్యా ఎంపీసీ విద్యార్థులు ఏఐ, డేటా సైన్స్ వంటి కంప్యూటర్ కోర్సుల వైపు మొగ్గు చూపుతుండగా, బైపీసీ విద్యార్థులు అగ్రి బిఎస్సీ, ఫార్మసీ వంటి రంగాలను ఎంచుకోవడం ఉత్తమం. కామర్స్ వాళ్లు సీఏ, బీబీఏ కోర్సులు ఉపాధిని ఇస్తాయి. విద్యార్థులు ఆసక్తిని బట్టి ముందుకెళ్లాలి.

News March 25, 2026

NZB: అత్యధిక ఉష్ణోగ్రతల వైపు జిల్లా

image

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మోస్రా, జకోరా, ఎడపల్లి 38.9°C, గోపన్ పల్లి, మదన్ పల్లి, పెర్కిట్ నిజామాబాద్(నార్త్) 38.8, నిజామాబాద్(సౌత్), కోటగిరి 38.7, మోర్తాడ్ 38.6, సాలూరా, మాచర్ల 38.5°C అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని 45 వెదర్ స్టేషన్లలో 35°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా తుంపల్లిలో 14మి.మీ వర్షపాతం రికార్డు అయ్యింది.