News May 2, 2024

సిద్దిపేట: కార్నర్ మీటింగ్.. రేవంత్ రెడ్డి స్పీచ్ హైలెట్స్

image

*కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15న రైతులను రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించారు.
*హరీష్ రావు రాజీనామా రాసిపెట్టుకో.. రుణమాఫీ చేసిన తర్వాత సిద్దిపేట చౌరస్తాలో లక్షమందితో సమావేశం నిర్వహిస్తాం.
*సిద్దిపేటలో దొరల రాజ్యం నడుస్తోంది.
*దుబ్బాక రావు.. సిద్దిపేట రావు పొద్దున రెండు పార్టీలు రాత్రి ఒక్కటే పార్టీ,
*మల్లన్నసాగర్‌లో భూములు గుంజుకొని అక్రమ కేసులు పెట్టివారికి ఎంపీ టికెట్

Similar News

News March 26, 2026

కౌడిపల్లి: ఫిట్స్‌తో పొలంలో రైతు మృతి

image

కౌడిపల్లి మండలం బుజరంపేట(పిర్యా) తండాలో విషాదం నెలకొంది. పొలంలో పనులు చేసుకుంటుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో రైతు సమ్యా నాయక్ మరణించినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఫిట్స్ రావడంతో ఆయన అదుపు తప్పి పొలంలోని బురదలో పడిపోయారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ముఖం బురదలో కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు మృతితో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News March 25, 2026

గ్రామీణులకు చేరువలోనే నాణ్యమైన వైద్యం: రాజనర్సింహ

image

TVVPని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చడం ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఈ మార్పుతో ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు, ప్రభుత్వ హోదా వంటి ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. జిల్లా ఆస్పత్రుల అభివృద్ధితో హైదరాబాద్‌పై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని చెప్పారు.

News March 25, 2026

మెదక్: కోర్టు పార్కింగ్ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం

image

మెదక్ జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో వాహనాల(2/3/4 wheelers) పార్కింగ్ నిర్వహణ కోసం సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. ఆసక్తి గల వారు ఏప్రిల్ 6 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ టెండర్ కాలపరిమితి ఏడాది పాటు (మే 1, 2026 నుంచి ఏప్రిల్ 30, 2027 వరకు) ఉంటుంది. సీల్డ్ టెండర్లు తెరిచిన అనంతరం బహిరంగ వేలం ద్వారా కాంట్రాక్ట్ కేటాయిస్తారు.