News February 23, 2026
అఫ్గాన్పై వైమానిక దాడుల్లో 70 మంది మృతి: పాక్

అఫ్గానిస్థాన్పై జరిపిన వైమానిక దాడుల్లో 70 మంది ‘ఉగ్రవాదులు’ హతమైనట్లు పాక్ ప్రకటించుకుంది. పాక్లో ఇటీవల జరిగిన వరుస ఆత్మాహుతి దాడులకు ప్రతీకారంగానే నంగర్హర్, పక్తికా ప్రాంతాల్లోని ‘ఏడు ఉగ్రవాద శిబిరాల’పై విరుచుకుపడ్డామని చెప్పుకొచ్చింది. అయితే, పాక్ చేసిన ఈ ప్రకటనను అఫ్గానిస్థాన్ ఖండించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని మండిపడింది.
Similar News
News March 1, 2026
ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా!

ఇవాళ HYDలో బంగారం, వెండి ధరల్లో మార్పులేదు. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,68,710, 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,54,650గా ఉంది. కేజీ వెండి ధర రూ.3,20,000 పలుకుతోంది. మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రేపు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News March 1, 2026
నాడు కత్తుల పోరు.. నేడు క్షిపణుల హోరు

పూర్వం రాజ్యాల కోసం రాజులు దండెత్తి, అమాయకులను బలితీసుకున్నారనే గాథలు విన్నాం. నేడు ఆధునిక ప్రపంచంలోనూ అదే క్రూరత్వం కనిపిస్తోంది. ఒకరిని అంతం చేసేందుకు దేశాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ భీకర దాడుల్లో పసిపిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అభివృద్ధి చెందిన దేశాలు సైతం పాతకాలపు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అమాయకుల రక్తంతో యుద్ధ క్షేత్రాన్ని తడపడం మానవత్వానికే తీరని మచ్చ.
News March 1, 2026
కలుపు మందుల వల్ల భూమికి కలిగే నష్టం

వ్యవసాయంలో కలుపు మొక్కల నివారణకు రసాయనాలతో కూడిన కలుపు మందుల వాడకం విపరీతంగా పెరిగింది. అనాలోచితంగా పంట భూములకు వీటిని వాడటం వల్ల కలుపుతో పాటు భూమిలో పంటకు మేలు చేసే జీవరాశి కూడా అంతమై, పంట పొలాలు నిర్జీవమయ్యే ప్రమాదం ఉంది. నేలలో జరిగే చర్యలు ఆగిపోయి మొక్కలకు పోషకాలు అందవు. సాగు, తాగు నీటి వనరులు, నేల నిర్మాణం పాడైపోయే ముప్పు ఉంది. అందుకే వీటిని తప్పనిసరిగా నిపుణుల సూచనలతో అవసరమైతేనే వాడాలి.


