News February 23, 2026

రోజంతా కూర్చుంటున్నారా? ఎక్సర్‌సైజ్ చేసినా వేస్ట్!

image

గంటల తరబడి కదలకుండా కూర్చోవడం ప్రాణాంతకమని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. రోజుకు 8గంటల కంటే ఎక్కువ కూర్చుంటే గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే ముప్పు 20% పెరుగుతుంది. ఉదయాన్నే ఎక్సర్‌సైజ్ చేసినా, రోజంతా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని అది భర్తీ చేయలేదు. దీనివల్ల బ్లడ్ ఫ్లో మందగించి కొవ్వు పేరుకుపోతుంది. ప్రతి 30నిమిషాలకోసారి సీటు నుంచి లేచి కాసేపు నడవడం లేదా స్ట్రెచింగ్ చేస్తే రిస్క్ తగ్గుతుంది.

Similar News

News February 26, 2026

పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక

image

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌(రాజస్థాన్)లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉదయం 10:10 గంటలకు విజయ్.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ సందర్భంగా అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ‘VIJAY DEVARAKONDA’ హ్యాష్‌ట్యాగ్ Xలో ట్రెండ్ అవుతోంది. సాయంత్రం మరోసారి ‘<<19227454>>కొడువ<<>>’ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.

News February 26, 2026

127KGల గోల్డ్ స్కామ్.. నటి రన్యారావుకు షాక్

image

బంగారం స్మగ్లింగ్ కేసులో దాదాపు ఏడాదిగా జైలులో ఉన్న కన్నడ నటి <<15969980>>రన్యారావుకు<<>> మరో షాక్ తగిలింది. తాజాగా ED బెంగళూరులోని PMLA కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును ప్రస్తావించింది. రూ.102 కోట్ల విలువైన 127 కేజీల బంగారాన్ని రన్యారావు సిండికేట్ ముఠా దుబాయ్ నుంచి INDకు అక్రమంగా తరలించినట్లు తెలిపింది. కాగా గతేడాది మార్చి 3న 14.2 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ నటి దొరికిపోయిన విషయం తెలిసిందే.

News February 26, 2026

తిరుమలలో నేటి నుంచి తెప్పోత్సవాలు

image

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతాయి. మార్చి 2వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామివారు దర్శనమిస్తారు. మొదటి రోజు శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు శ్రీకృష్ణస్వామి, చివరి 3 రోజులు మలయప్పస్వామి వారు తెప్పలపై విహరిస్తారు. ఈ వేడుకల కారణంగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు కొన్ని ప్రత్యేక సేవలను TTD రద్దు చేసింది.