News February 23, 2026

పబ్బతి ఆలయ ప్రసాదంపై భక్తుల అసహనం

image

మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు అందజేస్తున్న లడ్డూ ప్రసాదంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిమాణంతోపాటు నాణ్యత విషయంలో లడ్డూ బరువును తగ్గించడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ దారులు లాభాపేక్షతో ప్రసాదం బరువు తగ్గిస్తున్నారా? అనే అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రం ప్రతిష్ఠను కాపాడాలని వారు కోరుతున్నారు.

Similar News

News February 25, 2026

నిర్మల్ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధం

image

జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు, రోగ నిర్ధారణ కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని వైద్యశాఖ అధికారులను కలెక్టర్‌ అభిలాష అభినవ్ ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై పీసీ, పీఎన్‌డీటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనధికార ఆర్‌ఎంపీలను గుర్తించి, ప్రథమ చికిత్సకు మించి చికిత్సలు చేయకుండా నియంత్రించాలని సూచించారు.

News February 25, 2026

నిర్మల్: బాల్య వివాహాలను సమన్వయంతో అడ్డుకోవాలి: కలెక్టర్

image

గత సంవత్సరం 45, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 2 బాల్యవివాహాలను అడ్డుకున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాల్యవివాహాల సమాచారం అందిన వెంటనే సంక్షేమ, పోలీసు, విద్యాశాఖలు సమన్వయంతో అడ్డుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, నిర్ణీత వయస్సు వచ్చే వరకు వివాహం జరపమని ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలన్నారు. బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు.

News February 25, 2026

VKB: ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్.. 272 మంది ABSENT

image

ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 272 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. బుధవారం జిల్లాలో 8,672 మంది విద్యార్థులకు గానూ 8,400 మంది విద్యార్థులు మొదటి పరీక్షకు హాజరు కాగా 272 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చెప్పారు. జనరల్- 7,262 మంది విద్యార్థులకు 7,080 మంది హాజరుకాగా 182 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్- 1410 మందికి 1,320 హాజరుకాగా 90 మంది గైర్హాజరయ్యారు.