News May 3, 2024
టుడే హెడ్లైన్స్

* కాంగ్రెస్, BRS పార్టీలు ప్రభుత్వాన్ని మా చేతిలో పెడతాయి: మోదీ
* కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయి: రేవంత్
* బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోంది: కేటీఆర్
* AP: ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
* టీడీపీతో పొత్తును ఎన్నికలకు పరిమితం చేయొద్దు: మోదీ
* IPL: రాజస్థాన్పై SRH విజయం
Similar News
News March 14, 2026
ఇన్స్టాగ్రామ్లో ఇకపై నో ప్రైవసీ.. అలాంటి మెసేజ్లు చేస్తే..

Instagram నుంచి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ను మే 8 తర్వాత తొలగించనున్నట్లు Meta ప్రకటించింది. ఇకపై యూజర్లు పంపే కంటెంట్ను Meta చూడనుంది. అయితే ఈ మార్పులకు గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. పిల్లల పట్ల లైంగిక, ఇతర వేధింపులకు సంబంధించిన మెసేజ్లను గుర్తించేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. కాగా హానికర కంటెంట్ను గుర్తించేందుకు ఇలాంటి మార్పులు తేవాలని పలు దేశాలు గతంలోనే డిమాండ్ చేశాయి.
News March 14, 2026
10వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్?

AP: ఉగాది రోజున 60 విభాగాల్లో 10వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీలో భాగంగా 3,000కి పైగా టీచర్ పోస్టులు, 470 గ్రూప్-2, 101 గ్రూప్-1 పోస్టులు, వర్సిటీల్లో 1,500, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 1000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయో మరో 2, 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
News March 14, 2026
జీడిమామిడి తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

జీడిమామిడి తోటలను ఈ సమయంలో వాతావరణ మార్పుల కారణంగా కొమ్మ, పుష్ప గుచ్చాలను తొలిచే పురుగు, కాయ, గింజ తినే పురుగులు ఆశిస్తాయి. వీటిని గుర్తిస్తే అవసరాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మూడవ దఫాగా లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 1ML కలిపి పిచికారీ చేయాలి. వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి 15-20 రోజుల వ్యవధిలో పంటకు తప్పనిసరిగా నీరు పెట్టాలి. దీని వల్ల జీడి పిక్కలు రాలడం తగ్గి కాయల సైజు కూడా పెరుగుతాయి.


