News February 23, 2026
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. 888 మంది గైర్హాజరు: ఆర్ఐవో

నెల్లూరు జిల్లాలో మొదటి రోజు ఇంటర్ పరీక్ష ఎక్కడ మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఆర్ఐవో వరప్రసాదరావు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 81 కేంద్రాలలో 27,613 మంది విద్యార్థులకు గాను 888 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు, అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు.
Similar News
News March 2, 2026
నెల్లూరు: ఒక్క రోజులోనే రూ.వెయ్యి తగ్గింపు

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి కాలం కావడంతో జనవరి నుంచి ఫిబ్రవరి ప్రారంభం వరకు ధరలు తక్కువగా ఉన్నాయి. ఎండలు పెరగడంతో ధరల్లో ఊపు వచ్చింది. ఒక్కో బస్తాను రూ.7వేల వరకు విక్రయించారు. హోలీ కారణంగా ఉత్తరాధి రాష్ట్రాల్లోని మార్కెట్లకు వారం రోజులు సెలవు ప్రకటించారు. దీంతో నిమ్మ బస్తా ధర ఒక్కరోజులోనే రూ.వెయ్యి పడిపోయింది. ప్రస్తుతం రూ.4500 నుంచి రూ.5500 వరకు విక్రయిస్తున్నారు.
News March 2, 2026
నెల్లూరు: కరెంట్ సమస్య ఉంటే కాల్ చేయండి!

నెల్లూరు జిల్లాలో చాలా మంది కరెంట్ మీటర్లు, నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నేడు నిర్వహిస్తున్నామని ఎస్ఈ రాఘవేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల లోపు 0861 2320427 నంబర్కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.
News March 2, 2026
నెల్లూరు: నేటి నుంచి ఓపెన్ పరీక్షలు

నెల్లూరు జిల్లాలో నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు డీఈవో ఆర్.బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు, 10వ తరగతి విద్యార్థులకు 16 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్కు 12, 10వ తరగతికి 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.


