News February 23, 2026
గద్వాల: చట్టాలపై అవగాహనతోనే హక్కుల రక్షణ: అదనపు కలెక్టర్

పౌరులు తమ హక్కులను కాపాడుకోవడానికి చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 2013లో పోష్ (POSH) చట్టం అమల్లోకి వచ్చినా, మహిళలపై వేధింపులు కొనసాగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసినప్పుడే నిందితులకు శిక్ష పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 26, 2026
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 98.16% హాజరు

కామారెడ్డి జిల్లా కేంద్రం వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 7,878 మంది విద్యార్థులు నమోదు కాగా, అందులో 7,733 మంది హాజరై 145 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా హాజరు శాతం 98.16గా నమోదైంది. పరీక్షా కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
News February 26, 2026
కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాలి: కేంద్ర మంత్రి

సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తమ ఆదాయంలో కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు. ప్రొఫెషనల్ జర్నలిస్టుల నుంచి మారుమూల ప్రాంతాల క్రియేటర్ల వరకు అందరికీ దీన్ని వర్తింపజేయాలని సూచించారు. డీప్ ఫేక్ వీడియోలు పెరిగిపోతున్నాయని, పబ్లిష్ అయ్యే ప్రతీ కంటెంట్కూ ఆయా ప్లాట్ఫామ్స్ బాధ్యత వహించాలని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కాంక్లేవ్లో అన్నారు.
News February 26, 2026
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నూతన కలెక్టర్

యాదాద్రి జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం స్వామివారిని దర్శించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయానికి వచ్చిన ఆయనకు ఈవో భవాని శంకర్ ఘనస్వాగతం పలికారు. స్వయంభూవులను దర్శించుకున్న కలెక్టర్కు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు రఘు తదితరులు పాల్గొన్నారు.


