News February 23, 2026

జగిత్యాల: సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాలని కలెక్టర్ ఆదేశం

image

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. డీఆర్‌ఎస్‌సీ సమావేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, సైన్ బోర్డుల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్‌హెచ్-63, ఎన్‌హెచ్-563 రహదారులపై సమస్యాత్మక ప్రాంతాలను తక్షణం పరిష్కరించాలని సూచించారు.

Similar News

News February 25, 2026

నల్గొండ జిల్లాలో ముగ్గురు వైద్యులపై వేటు

image

రాష్ట్రంలో విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న 94 మంది వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నల్గొండ జిల్లాకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రియదర్శిని, మాధురి, శ్రీవిద్య మాధ ఉన్నారు.

News February 25, 2026

భద్రత కల్పించాలన్న కాటసాని పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

image

తనకు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాటసాని రాంభూపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం పోలీసు భద్రతనేది హోదాగా మారిందని, దానికి ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలని CJI ధర్మాసనం కాటసాని లాయర్‌ను ప్రశ్నించింది. శక్తిమంతులైన మీరు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. మీకు ముప్పు ఉంటే నిఘా వ్యవస్థలు అంచనా వేస్తాయని పేర్కొంది.

News February 25, 2026

భూపాలపల్లి: తొలిరోజు పరీక్షకు 1,772 మంది హాజరు

image

జిల్లాలో ఇంటర్ పరీక్షల కోలాహలం మొదలైంది. బుధవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 1,829 మంది విద్యార్థులకు గాను 1,772 మంది పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, తాగునీరు, ఇతర సౌకర్యాల్లో లోటు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.