News May 3, 2024
75 వేల ఏళ్ల నాటి మహిళ ముఖాన్ని సృష్టించారు

కేంబ్రిడ్జి పురావస్తు శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. 75 వేల ఏళ్ల కిందటి మహిళ పుర్రె ఆధారంగా ఆమె ముఖాన్ని తిరిగి సృష్టించారు. నియాండర్తల్స్ జాతికి చెందిన మహిళగా ఆమెను పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి ఏడాది సమయం పట్టినట్లు తెలిపారు. కాగా ఇరాక్ కుర్దిస్తాన్లోని షానిదార్ గుహలో ఈ పుర్రెను గుర్తించారు. 6 లక్షల ఏళ్ల క్రితం మానవ జాతి రెండు బృందాలుగా విడిపోగా అందులో ఒకటే నియాండర్తల్స్.
Similar News
News March 30, 2026
4 లక్షల చాక్లెట్స్ చోరీ.. కంపెనీ ఫన్నీ రియాక్షన్!

4.14 లక్షల చాక్లెట్లు చోరీ కావడంపై నెస్లే బ్రాండ్ ‘కిట్ క్యాట్’ ఫన్నీగా స్పందించింది. ‘కిట్క్యాట్తో బ్రేక్ తీసుకోమని మేం చెబుతుంటాం. కానీ ఈ దొంగలు మా స్లోగన్ను మరీ సీరియస్గా తీసుకున్నారు. ఏకంగా 12 టన్నుల చాక్లెట్లతో బ్రేక్ తీసుకున్నారు’ అని పేర్కొంది. మార్చి 26న చాక్లెట్ల లోడుతో ఇటలీ నుంచి పోలండ్ వెళ్తున్న ట్రక్కు మార్గమధ్యంలో మాయమైపోయింది. ఇప్పటికీ దాని ఆచూకీ తెలియరాలేదని నెస్లే తెలిపింది.
News March 30, 2026
నామినేషన్ వేసిన CM స్టాలిన్, విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ కొలత్తూరు నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. అటు తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత, నటుడు విజయ్ దళపతి కూడా పెరంబూరు నియోజకవర్గానికి సంబంధించి చెన్నైలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
News March 30, 2026
చైనా సీసీటీవీలపై దేశంలో బ్యాన్?

ఏప్రిల్ 1 నుంచి హిక్విజన్, దహువా, TP-Link తదితర చైనా CCTV కెమెరాలు, పరికరాలను దేశంలో బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో అమ్మే CCTV ప్రొడక్టులు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చైనా సంస్థలు, ఆ దేశంలో తయారైన చిప్సెట్లను ఉపయోగించే పరికరాలకు పర్మిషన్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నట్లు సమాచారం.


