News February 23, 2026
అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్

జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ ఎగ్జామ్ నేపథ్యంలో అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 45 కేంద్రాల్లో 8,157 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 27, 2026
లైఫ్ సైకిల్ ఫండ్స్ వచ్చేశాయ్.. గోల్ని బట్టి డబ్బులు అడ్జస్ట్!

పిల్లల చదువులు లేదా రిటైర్మెంట్ కోసం పడే తిప్పలు తప్పించేలా సెబీ ‘లైఫ్ సైకిల్ ఫండ్స్’ తెచ్చింది. ఇందులో ఎంత కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో చెబితే చాలు. మొదట్లో లాభాల కోసం షేర్ మార్కెట్లో ఎక్కువ పెట్టి, లక్ష్యం దగ్గర పడేకొద్దీ దాన్ని సేఫ్ డిపాజిట్లలోకి ఫండ్ మేనేజరే మార్చేస్తారు. పాతకాలపు రిటైర్మెంట్ ఫండ్స్ ప్లేస్లో ఇవి వస్తున్నాయి. ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలనే టెన్షన్ ఉండదిక.
News February 27, 2026
పాడి పశువులను కొనే ముందు జాగ్రత్తలు

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.
News February 27, 2026
ఆరుట్ల మోడల్.. 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్!

TG: రంగారెడ్డి(D) ఆరుట్ల స్కూల్ తరహాలో 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(TPS) ప్రారంభించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. క్లాస్ రూములు, గ్రౌండ్, ట్రాన్స్పోర్ట్, టీచింగ్ స్టాఫ్ వంటి సకల వసతులు ఉండేలా చూడాలన్నారు. ఇక HYDలో 12 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏడాదిలోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యమైన విద్య కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమని స్పష్టం చేశారు.


