News May 3, 2024
బంగ్లాతో సిరీస్ భారత్ వశం

బంగ్లాదేశ్తో ఐదు టీ20ల సిరీస్ను రెండు మ్యాచులు మిగిలి ఉండగానే భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది. నిన్న జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 117 పరుగులు చేసింది. ఛేదనలో 18.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని అందుకుంది. భారత ప్లేయర్లు షెఫాలి వర్మ(51), స్మృతి మంధాన(47) రాణించారు.
Similar News
News March 17, 2026
ఒత్తిడి పెరిగితే.. అందం తగ్గిపోతుంది

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.
News March 17, 2026
ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపు ఎందుకు వస్తుంది?

ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు రావడాన్ని వైద్య పరిభాషలో జెస్టెషనల్ ఎడిమా అంటారు. గర్భిణిలలో ఏడో నెల నుంచి కాళ్లవాపు సాధారణంగా కనిపిస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు కాళ్లలో వాపు వస్తుంది. ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకున్నపుడు కూడా కొన్నిసార్లు కాళ్లవాపు కనిపిస్తుంది. సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News March 17, 2026
డిప్రెషన్ కూడా గుండెపోటుకు కారణమే!

గుండెపోటుకు కొలెస్ట్రాల్ మాత్రమే కారణం కాదని, మానసిక సమస్యలు, నిద్రలేమి కూడా ప్రధాన కారణాలని తాజా పరిశోధనలో వెల్లడైంది. 2.2కోట్ల మందిపై చేసిన అధ్యయనంలో.. డిప్రెషన్, యాంగ్జైటీ, PTSD వల్ల గుండెపోటు ముప్పు 3 రెట్లు పెరుగుతుందని తేలింది. ‘మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగి ధమనులు దెబ్బతింటాయి. అందుకే గుండెను కాపాడుకునేందుకు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించండి’ అని వైద్యులు సూచిస్తున్నారు.


