News May 3, 2024
భీమిలి కొట్లాట కేసులో పదిమంది అరెస్ట్

భీమిలి మండలం గొల్లల తాళ్లవలసలో ఈనెల 1వ తేదీన టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించి పది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కొట్లాట సమాచారం మేరకు మధురవాడ జోన్ ఏసీపీ సునీల్, భీమిలి సీఐ డి.రమేష్ తదితరులు ఈనెల 1వ తేదీ రాత్రి నుంచి గ్రామంలో భద్రత ఏర్పాట్లు చేశారు. విచారణ అనంతరం ఇరు వర్గాలకు చెందిన పదిమందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News March 14, 2026
విశాఖలో నియోజకవర్గ వైసీపీ పరిశీలకుల నియామకం

విశాఖలోని అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకులుగా పలువురుని వైసీపీ కేంద్రపార్టీ కార్యాలయం నియమించింది.
➤ విశాఖ నార్త్: చింతకాయల సన్యాసి పాత్రుడు
➤ విశాఖ సౌత్: వీసం రామకృష్ణ
➤ విశాఖ వెస్ట్: జాహీర్ అహ్మద్
➤ విశాఖ ఈస్ట్: పేడాడ రమణి కుమారి
➤ గాజువాక: పసుపులేటి బాలరాజు
➤ భీమిలి: తైనాలా విజయ్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
News March 14, 2026
భీమిలి: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

భీమిలి పరిధి కాపుల ఉప్పాడలో ఉంటున్న అప్పలరాజు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అప్పలరాజు తీవ్రంగా గాయపడడంతో గీతం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇక్కడి నుంచి కేజీహెచ్కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు భీమిలి పోలీసులు తెలిపారు.
News March 14, 2026
విశాఖ: దూసుకెళ్లిన స్కూలు బస్సు.. ఒకరి మృతి

శుభకార్యానికి వెళ్తున్న వ్యక్తిని స్కూలు బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. భీమిలి మండలం నారాయణరాజుపేట జంక్షన్లో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయనగరం (D) డెంకాడ (M) జొన్నాడకి చెందిన జీ.సూర్యనారాయణ మరొకరి బైక్పై వెళ్తుండగా స్కూలు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును క్లీనర్ డ్రైవ్ చేసినట్లు భీమిలి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.


